విచ్చలవిడి మద్యం వల్లే అత్యాచారాలు ః భట్టి విక్రమార్క

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, విచ్చలవిడిగా మద్యం విక్రయాల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని లింగాపూర్ అటవీ ప్రాంతంలో సీఎల్పీ నేతల బృందం పర్యటించింది. లింగాపూర్ అటవీ ప్రాంతంలో అత్యాచారం, హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ…పోలీసులను ప్రభుత్వమే వారి విధులు సక్రమంగా నిర్వహించనీయడం లేదని ఆరోపించారు. అక్రమ మద్యం విక్రయాలకు ప్రభుత్వమే ద్వారాలు తెరిచిందన్నారు. అత్యాచారాలు నియంత్రించడంలో ప్రభుత్వం […]

విచ్చలవిడి మద్యం వల్లే అత్యాచారాలు ః భట్టి విక్రమార్క
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 09, 2019 | 7:21 PM

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, విచ్చలవిడిగా మద్యం విక్రయాల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని లింగాపూర్ అటవీ ప్రాంతంలో సీఎల్పీ నేతల బృందం పర్యటించింది. లింగాపూర్ అటవీ ప్రాంతంలో అత్యాచారం, హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ…పోలీసులను ప్రభుత్వమే వారి విధులు సక్రమంగా నిర్వహించనీయడం లేదని ఆరోపించారు. అక్రమ మద్యం విక్రయాలకు ప్రభుత్వమే ద్వారాలు తెరిచిందన్నారు. అత్యాచారాలు నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.