ఎయిర్‌టెల్‌ సంచలన ఆఫర్..రీఛార్జ్‌పై 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్

జియో వచ్చిన తర్వాత మిగిలిన టెలికాం కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన సంగతి తెలసిందే. ఊహించని ఆఫర్లు, ఎగ్జైట్ చేసే ప్లాన్స్‌తో జియో ప్రస్తుతం ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది. కాగా జియోకి చెక్ పెట్టేందుకు..కాంపీటషన్‌‌లో ముందుకొచ్చేందుకు..  ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.599 ప్లాన్‌లో ఉన్న ప్రీ-పెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులకు జీవిత బీమా కవరేజ్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ భారతీ యాక్సాతో ఒప్పందం కుదుర్చుకుంది. మెసేజ్ చెయ్యడం ద్వారా, […]

ఎయిర్‌టెల్‌ సంచలన ఆఫర్..రీఛార్జ్‌పై 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్
Follow us

|

Updated on: Nov 05, 2019 | 3:35 AM

జియో వచ్చిన తర్వాత మిగిలిన టెలికాం కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన సంగతి తెలసిందే. ఊహించని ఆఫర్లు, ఎగ్జైట్ చేసే ప్లాన్స్‌తో జియో ప్రస్తుతం ఏకఛత్రాధిపత్యం వహిస్తుంది. కాగా జియోకి చెక్ పెట్టేందుకు..కాంపీటషన్‌‌లో ముందుకొచ్చేందుకు..  ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.599 ప్లాన్‌లో ఉన్న ప్రీ-పెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులకు జీవిత బీమా కవరేజ్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సంస్థ భారతీ యాక్సాతో ఒప్పందం కుదుర్చుకుంది. మెసేజ్ చెయ్యడం ద్వారా, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్, ఎయిర్‌టెల్ రిటైలర్ వద్దకు వెళ్లి కూడా ఇన్సూరెన్స్ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు.

భారతీ ఎయిర్‌టెల్‌ నూతన ప్రీ-పెయిడ్‌ ప్లాన్‌ అయిన రూ.599 ప్రకారం.. రోజుకు 2జీబీల డాటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రూ.4 లక్షల జీవిత బీమాను భారతీ యాక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కల్పించనున్నది. ఈ ప్లాన్‌ 84 రోజుల పాటు అమలులో ఉండనున్నది. 18 ఏండ్ల నుంచి 54 ఏండ్ల లోపు వయస్సు కలిగిన వారికి మాత్రమే బీమా కవరేజ్‌ కల్పిస్తున్నది సంస్థ. అంతేకాదు ఎలాంటి వైద్య పరీక్షలు,  డెత్ సర్టిఫికేట్లు అవసరం లేదనీ, తక్షణమే డిజిటల్‌ కాపీని కస్టమర్ ఇంటికే పంపిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. కాగా తమిళనాడు, పాండిచ్చేరి, న్యూఢిల్లీ సహా ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రారంభించిందని, క్రమంగా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ఆఫర్‌ ప్రారంభించనున్నట్లు కంపెనీ  తెలిపింది.