కడపకు బయల్దేరిన జగన్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ అధినేత, ఏపీకి కాబోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడపకు బయల్దేరారు. కడప పర్యటనలో భాగంగా ఈ రోజు పెద్ద దర్గాను సందర్శంచనున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్న జగన్.. అక్కడి నుంచి పులివెందులకు వెళ్లి సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తరువాత ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు. పర్యటన ముగిశాక ఈ సాయంత్రం విజయవాడకు చేరుకోనున్న జగన్.. గురువారం […]
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ అధినేత, ఏపీకి కాబోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడపకు బయల్దేరారు. కడప పర్యటనలో భాగంగా ఈ రోజు పెద్ద దర్గాను సందర్శంచనున్నారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్న జగన్.. అక్కడి నుంచి పులివెందులకు వెళ్లి సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు.
ఆ తరువాత ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు. పర్యటన ముగిశాక ఈ సాయంత్రం విజయవాడకు చేరుకోనున్న జగన్.. గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కేసీఆర్, గవర్నర్ నరసింహన్తో కలిసి మోదీ ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ వెళ్లనున్నారు.