రాజస్థాన్లో విజృంభిస్తోన్న కరోనా.. తాజాగా మరో 78 కేసులు..
రాజస్థాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే పద్దెనిమిది వేల మార్క్ దాటేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 78 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు..
రాజస్థాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే పద్దెనిమిది వేల మార్క్ దాటేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 78 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,092కి చేరింది. ఈ విషయాన్ని బుధవారం నాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా పన్నెండు మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 3,447 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 18వేల మందికి పైగా కరోనా పాజిటివ్గా నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5.66 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
78 #COVID19 cases and 12 recoveries reported in Rajasthan today, as of 10:30 am. Total number of cases in the state is now at 18,092, including 3,447 active cases, & 413 deaths: State Health Department pic.twitter.com/QF6o7Oe5Yx
— ANI (@ANI) July 1, 2020