జగనన్న పల్లె వెలుగు: 2 వేల గ్రామాల్లో 4 లక్షల ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు
సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్ దూసుకుపోతున్నారు. జగనన్న పల్లె వెలుగు పథకం కింద రాష్ట్రంలోని 2 వేల ఆవాస గ్రామాల్లో 4 లక్షల ఎల్ఈడీ లైట్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్ దూసుకుపోతున్నారు. జగనన్న పల్లె వెలుగు పథకం కింద రాష్ట్రంలోని 2 వేల ఆవాస గ్రామాల్లో 4 లక్షల ఎల్ఈడీ లైట్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న పథకాల్లో ఏ విధంగా కవర్ కానీ గ్రామాలను ఇందుకు ఎంపిక చేయనున్నారు. ఏపీ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నూతనంగా ఫిర్యాదుల మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. వెలగని వీధి దీపాలను విలేజ్ సెక్రటరీలు ఎప్పటికప్పుడు ఈ సీఎంఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను అనుసరించి పరిష్కరిస్తారన్నారు.
Also Read: ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్ప్లాజాలు..