భారత్‌లో 30 శాతం డ్రైవింగ్ లైసెన్స్‌లు ఫేక్- నితిన్ గడ్కరీ

భారతదేశంలో సుమారు 30% డ్రైవింగ్ లైసెన్సులు నకిలీవని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు.  ఇప్పటికే చాలా ఆలస్యం అయిన మోటారు వాహనాల (సవరణ) బిల్లును ఆమోదించడానికి బలంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గడ్కరీ మాట్లాడుతూ.. “ లైసెన్స్‌లను సులభంగా పొందగలిగే ప్రదేశం ప్రపంచంలో ఏదైనా ఉంటే, అది ఇండియానే. ఇక్కడ డ్రైవర్ లైసెన్స్ పొందడం చాలా సులభం. మీరు లైసెన్స్‌లలో ఫోటోలను చూసినట్లయితే, అవి నడిపే వ్యక్తులతో సరిపోలడం లేదు. […]

భారత్‌లో 30 శాతం డ్రైవింగ్ లైసెన్స్‌లు ఫేక్- నితిన్ గడ్కరీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 16, 2019 | 12:57 PM

భారతదేశంలో సుమారు 30% డ్రైవింగ్ లైసెన్సులు నకిలీవని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు.  ఇప్పటికే చాలా ఆలస్యం అయిన మోటారు వాహనాల (సవరణ) బిల్లును ఆమోదించడానికి బలంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గడ్కరీ మాట్లాడుతూ.. “ లైసెన్స్‌లను సులభంగా పొందగలిగే ప్రదేశం ప్రపంచంలో ఏదైనా ఉంటే, అది ఇండియానే. ఇక్కడ డ్రైవర్ లైసెన్స్ పొందడం చాలా సులభం. మీరు లైసెన్స్‌లలో ఫోటోలను చూసినట్లయితే, అవి నడిపే వ్యక్తులతో సరిపోలడం లేదు. ప్రజలు చట్టం పట్ల ఎటువంటి భయం లేదా గౌరవం లేకుండా డ్రైవ్ చేస్తారు. రూ.50-100 చలాన్ల గురించి ఎవరూ పట్టించుకోరు, పోలీసులను ఎదురుగానే ఉంచుకొని విచ్చలవిడిగా డ్రైవ్ చేస్తారు ”అని అన్నారు.

దేశంలో ఏటా 1,50,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని మంత్రి చెప్పారు. “నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నించినప్పటికీ నేను చట్టాన్ని తీసుకురాలేదు అనేది నా అతిపెద్ద వైఫల్యం. కానీ ఇప్పుడు దాన్ని దాటి ప్రాణాలను కాపాడుకుందాం. మేము బలమైన  ప్రయత్నాలు చేస్తున్నప్పటికి..  భారతదేశంలో ప్రమాదాల సంఖ్యను 3-4% తగ్గించగలిగాము, కాని తమిళనాడులో ఇది 15% తగ్గించబడింది. తమిళనాడు నమూనాను అనుకరించాలని మరియు ప్రమాదాలను అరికట్టాలని మేము ఆశిస్తున్నాము’ అని గడ్కరీ పేర్కొన్నారు.