చేతులెత్తి నమస్కరిస్తున్నా : ఎమ్మెల్యే రోజా

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఏపీ లోనే న్యాయస్థానాలు ఈ విధంగా గ్యాగ్ ఆర్డర్ నోటీసులు ఎందుకు ఇస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా సందేహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన కోర్టులు కళ్లు తెరచి..

చేతులెత్తి నమస్కరిస్తున్నా : ఎమ్మెల్యే రోజా
Follow us

|

Updated on: Sep 19, 2020 | 5:09 PM

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఏపీ లోనే న్యాయస్థానాలు ఈ విధంగా గ్యాగ్ ఆర్డర్ నోటీసులు ఎందుకు ఇస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా సందేహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన కోర్టులు కళ్లు తెరచి చంద్రబాబు అవినీతికి సపోర్టుగా గ్యాగ్ ఆర్డర్ చేయకుండా ఉండాలన్నారు. ఇందుకోసం మరొక్కసారి న్యాయ వ్యవస్థను చేతులేత్తి నమస్కరించి కోరుతున్నానని రోజా వేడుకున్నారు. పనిలో పనిగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రోజా. చంద్రబాబు నాయుడికి దమ్ము, ధైర్యం ఉంటే నారా లోకేష్ ఫైబర్ గ్రిడ్ స్కాంపై ఎదుర్కొంటున్న ఆరోపణలకు.. తన సామాజిక వర్గం చేసిన అమరావతి రియల్ ఎస్టేట్ దందా పైన సీబీఐ చేత దర్యాప్తు చేయమని కోరాలని రోజా సవాల్ విసిరారు. గతంలో తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి పై ఆరోపణలు వచ్చినపుడు ధైర్యంగా సీబీఐ విచారణ చేపట్టాలని.. నేరం రుజువైతే ఉరితీయండని.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కోరిన విషయాన్ని ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు.