గుండాల ఎస్ఐ రాజు ఓవ‌రాక్ష‌న్..రైతుపై దాడి…తీవ్ర గాయాలు

సివిల్ కేసులు ఇక్కడ ప‌రిష్క‌రించ‌బ‌డ‌వు అని పోలీస్ స్టేష‌న్ లో పెద్ద బోర్డు పెడ‌తారు. కానీ కొందరు పోలీసులు వాటిల్లోనే ఎక్కువ త‌ల‌దూరుస్తారు.

గుండాల ఎస్ఐ రాజు ఓవ‌రాక్ష‌న్..రైతుపై దాడి...తీవ్ర గాయాలు
Follow us

|

Updated on: Jun 21, 2020 | 11:20 AM

సివిల్ కేసులు ఇక్కడ ప‌రిష్క‌రించ‌బ‌డ‌వు అని పోలీస్ స్టేష‌న్ లో పెద్ద బోర్డు పెడ‌తారు. కానీ కొందరు పోలీసులు వాటిల్లోనే ఎక్కువ త‌ల‌దూరుస్తారు. తాజాగా (యాదాద్రి-భువనగిరి జిల్లా) గుండాల ఎస్ఐ రాజు ఓ సివిల్ త‌గాదాలో త‌ల‌దూర్చాడు. అంతేకాదు ఈ విష‌యంలో కాస్త ఓవ‌రాక్ష‌న్ కూడా చేశాడు. వివాదం విష‌యంలో తుర్కలషాపురం గ్రామ రైతు జక్కుల బిక్షమయ్య పై పోలీస్ స్టేషన్ లో వాటర్ బాటిల్ తో దాడి చేశాడు. ఆ బాటిల్ రైతు మర్మాంగాలను బ‌లంగా తాకింది. దీంతో విల‌విల్లాడిన రైతు అక్క‌డే కూలిపోయాడు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు కుటుంబ స‌భ్యులు. రైతుకు తీవ్ర గాయ‌లైన‌ట్టు తెలుస్తోంది. కాగా ఎస్ఐ రాజు ప్ర‌వ‌ర్త‌న‌పై స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అత‌డు గ‌తంలోనూ ఇటువంటి దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిపారు.

Latest Articles