ఏటీఎంకు వెళ్లలేకపోతే..ఇంటి వద్దకే డబ్బులు..ఎలాగంటే..?
కరోనా..ప్రస్తుతం ప్రంపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న వైరస్. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ మహమ్మారి ఎఫెక్ట్ తో లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ఇంట్లో నుంచి అడుగు భయటపెట్టాలంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రా చార్జీలు, మిలిమన్ బ్యాలెన్స్ చార్జీలు ఎత్తివేశారు. అయినప్పటికి బయటకి వెళ్లి ఏటీఎంలో డబ్బులు తీసుకోవాటలంటే 100 కష్టాలు ఉన్నాయి ప్రస్తుతం. అయితే బ్యాంకు కస్టమర్లు ఇంటి వద్ద నుంచే పలు సర్వీసులు పొందే వెసులుబాటు ఉంది. […]
కరోనా..ప్రస్తుతం ప్రంపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న వైరస్. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ మహమ్మారి ఎఫెక్ట్ తో లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ఇంట్లో నుంచి అడుగు భయటపెట్టాలంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రా చార్జీలు, మిలిమన్ బ్యాలెన్స్ చార్జీలు ఎత్తివేశారు. అయినప్పటికి బయటకి వెళ్లి ఏటీఎంలో డబ్బులు తీసుకోవాటలంటే 100 కష్టాలు ఉన్నాయి ప్రస్తుతం. అయితే బ్యాంకు కస్టమర్లు ఇంటి వద్ద నుంచే పలు సర్వీసులు పొందే వెసులుబాటు ఉంది. అందులో ఏటీఎం సేవలు కూడా ఉన్నాయి.
పలు బ్యాంకులు కస్టమర్స్ కు డోర్ స్టెప్ సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే. వీటిలో భాగంగా ఏటీఎంకు వెళ్లకుండా కూడా డబ్బులు పొందవచ్చు. ఎస్ బి ఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్రా బ్యాంకులు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి.
అయితే ఈ బ్యాంక్స్ లో ఖాతాదారులు అయి ఉన్న సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు మాత్రమే ఈ సేవలకు అర్హులు. అయితే మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో అందరు కస్టమర్స్ ఈ సేవలను పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఈ సర్వీసుకు రూ.100 చార్జ్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్… రూ.5,000 నుంచి రూ.25,000 వరకు డబ్బులు ఇంటి వద్దకు పొందవచ్చు. ఈ బ్యాంక్ కూడా ఈ సేవలకు రూ.100 నుంచి రూ.200 వరకు చార్జ్ చేస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు కూడా కస్టమర్ కేర్కు కాల్ చేసి ఈ సేవను పొందొచ్చు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మాత్రమే బ్యాంకు ఈ సేవను అందిస్తోంది. రూ.2,000 నుంచి ఏకంగా రూ.2 లక్షల వరకు డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉంది. దీని కోసం బ్యాంక్ రూ.50 …అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ అమౌంట్లో 18 శాతం వరకు చార్జీని వసూలు చేస్తోంది.