Andhra: బస్సు ఆగగానే మహిళ పరుగో పరుగు.. ఆమె చేతిలో ఓ బ్యాగ్.. ఆ తర్వాత
బస్సు ఇలా తిరుపతి స్టేషన్లో ఆగిందో లేదో.. ఠక్కున ఓ మహిళ పరుగులు పెట్టింది. ఆమె చేతిలో ఓ బ్యాగ్ ఉంది. అసలు ఏమైంది.? డౌట్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూడగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో దొంగతనం జరిగింది. ఓ మహిళ ప్రయాణీకురాలి హ్యాండ్ బ్యాగ్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 3.85 లక్షల చోరీ చేశారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన సదరు ప్రయాణీకురాలు.. వెంటనే టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. హుటాహుటిన ఆర్టీసీ బస్టాండ్కు చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ మహిళ, బాలుడితో కలిసి ఈ దొంగతనం చేసినట్టు అనుమానిస్తున్నారు. కాగా, చోరీకి పాల్పడిన వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.