సౌదీ అరేబియా దేశం గత పది రోజుల్లో ఏకంగా 12 మంది దోషుల తలలు నరికి మరణశిక్ష అమలు చేసింది. 12 మందిలో ముగ్గురు పాకిస్తానీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డాన్, ముగ్గురు సౌదీ పౌరులు ఉన్నారు. ఈ 12 మంది ముద్దాయిలు డ్రగ్స్ కేసుల్లో జైలు పాలైనవారే. వీధి కుక్కలే నేస్తాలుగా పుట్పాత్పై నిద్రపోతున్న వ్యక్తి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అతను 24 క్యారెట్స్ గోల్డ్ అంటున్నారు నెటిజనం. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి సన్మానం చేశారు ప్రజలు. హర్యానాలో కేవలం 66 ఓట్ల తేడాతో ధర్మపాల్ ఓడిపోయారు. తలా కొంత వేసుకుని 2 కోట్ల రూపాయల విలువైన కారు కానుకగా ఇచ్చుకున్నారు.