గడ్డి కోస్తుండగా అదే పనిగా శబ్దాలు.. వెనక్కి తిరిగి చూడగా షాక్‌

Updated on: Feb 14, 2026 | 9:00 AM

ఏలూరు జిల్లాలో పొలంలో గడ్డి కోస్తున్న రైతుకు వింత శబ్దాలు వినిపించి, భారీ కొండచిలువ కనిపించింది. దానిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించగా, ఒకేసారి మూడు పెద్ద కొండచిలువలు బయటపడ్డాయి. భయంతో వాటిని స్థానికులు హతమార్చారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాములను స్నేక్‌క్యాచర్‌ల ద్వారా రక్షించాలే తప్ప చంపకూడదని ఆవేదన చెందుతున్నారు.

చిన్న పాము పిల్లను చూసినా భయంతో హడలి పోతాం. భయంతో దూరంగా పరుగుతీస్తాం. అలాంటిది ఒకేసారి..ఒకేచోట మూడు పెద్ద పెద్ద పాములు కనిపిస్తే.. గుండె ఆగినంత పనౌతుంది కదా.. సరిగ్గా అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలో జరిగింది. పొలంలో గడ్డి కోస్తున్న రైతుకు వింత శబ్దాలు వినిపించాయి. దాంతో వెనక్కి తిరిగి చూసిన రైతుకు ఒక భయానక దృశ్యం కనిపించింది. అనికి భారీ కొండచిలువ కనిపించింది. అతను చూస్తుండగానే అది అక్కడే ఉన్న రాళ్లలోకి దూరిపోయింది. భయంతో రైతు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న ఇతర రైతులు అక్కడికి చేరుకున్నారు. కొండచిలువను గుర్తించి దానిని బయటకు రప్పించేందుకు అంతా కలిసి ఆ రాళ్లకు పొగపెట్టారు. దాంతో ఒక్కసారిగా మూడు కొండచిలువలు బటయకు వచ్చాయి. భయాందోళనకు గురైన స్థానికులు వాటిని హతమార్చారు. దీనిపై జంతు ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాములు కనిపిస్తే స్నేక్‌క్యాచర్‌ ద్వారా వాటిని రక్షించాలి కానీ.. అలా చంపకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్

Loading...
Unable to load recommendations.
Follow Us