35 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్ల.. ఆనందంతో తండ్రి..

|

Jun 03, 2023 | 9:41 PM

టెక్నాలజీ యుగంలోనూ మనుషుల ఆలోచనలు మారడంలేదు. ఎక్కడో అక్కడ ఏదోఒక అమానుష ఘటన చోటుచేసుకుంటూనే ఉంది. ఇక ఆడపిల్లలపై వివక్ష గురించి చెప్పనక్కర్లేదు. మహిళలను పురుషులను మించి అన్నిరంగాలలోనూ సత్తాచాటుతున్నా మహిళలను చిన్నచూపు చూస్తునే ఉన్నారు.

టెక్నాలజీ యుగంలోనూ మనుషుల ఆలోచనలు మారడంలేదు. ఎక్కడో అక్కడ ఏదోఒక అమానుష ఘటన చోటుచేసుకుంటూనే ఉంది. ఇక ఆడపిల్లలపై వివక్ష గురించి చెప్పనక్కర్లేదు. మహిళలను పురుషులను మించి అన్నిరంగాలలోనూ సత్తాచాటుతున్నా మహిళలను చిన్నచూపు చూస్తునే ఉన్నారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకున్నాడు. అమ్మాయిని అంబారీపై ఎక్కంచి ఊరేగించాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని కొల్హాపూర్‌లో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్‌గావ్‌ గ్రామానికి చెందిన గిరీశ్ పాటిల్‌కు ఐదు నెలల క్రితం పాప పుట్టింది. ఆ వంశంలో అమ్మాయి పుట్టడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఆ ఇంట ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. లేక లేక కలిగిన ఆడపిల్లను ఆ కుటుంబం ఏనుగుపై ఊరేగించింది. పాపకు ‘ఐరా’ అని పేరు పెట్టారు. చిన్నారిని మే 27న ఇంటికి తీసుకురాగా దానిని ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిగా మార్చుకున్నారు. ఐరాను ఏనుగుపై ఊరేగిస్తూ డప్పు వాయిద్యాల మధ్య గిరీశ్ తన ఇంటికి తీసుకెళ్లాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్‌ చరణ్‌ హంగామా..

ఘుమఘుమలు సరే.. బిర్యానీతో బరువు తగ్గుతారని తెలుసా ??

TOP 9 ET News: హాలీవుడ్‌ను తాకిన గుంటూరు కారం | శర్వా పెళ్లిలో.. రామ్‌ చరణ్ హంగామా

Rain Alert: 4 రోజుల పాటు వానలే వానలు.. ఎల్లో అలర్జ్ జారీ..

Cooking Oil: సామాన్యులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు

Follow us on