ఆస్తి పంపకాల్లాగే అంత్యక్రియల పంపకం.. తండ్రి మృతదేహాన్ని

Updated on: Feb 10, 2025 | 4:07 PM

అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడం చూస్తుంటాం. తాజాగా ఒక ఇద్దరు కొడుకులు తండ్రి అంత్యక్రియల విషయంలో గొడవపడ్డారు. ఆస్తులు పంచుకున్నట్లుగా తండ్రి మృతదేహాన్ని పంచుకుందాం అని రెండు ముక్కలు చేసి వేరువేరుగా అంత్యక్రియలు నిర్వహిద్దాం అంటూ పెద్ద కొడుకు గొడవ చేశాడు. ఆపై ఏం జరిగిందో ఈ స్టోరీ చూసేయండి.

మధ్యప్రదేశ్ లోని ధీఖంకర్ జిల్లా లిధౌరతాల్ గ్రామానికి చెందిన 85 ఏళ్ల ధ్యాని సింగ్ గోష్ కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దామోదర్ తండ్రి బాధ్యతలు చూసుకుంటున్నాడు. చాలాకాలంగా ధ్యాని సింగ్ దామోదర్ వద్దే ఉండగా తాజాగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చిన్న కుమారుడు దామోదర్ తన ఇంటి వద్దే అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశాడు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు అంతా అంత్యక్రియల కోసం రాగా పెద్ద కుమారుడు కిషన్ సింగ్ కూడా హాజరయ్యాడు. తానే తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తానని పెద్ద కుమారుడే తండ్రికి దహన సంస్కారాలు చేయాలంటూ చెప్పాడు. కానీ దామోదర్ మాత్రం అందుకు అస్సలే ఒప్పుకోలేదు. మొదటి నుంచి తండ్రిని తానే చూసుకుంటున్నానని అంతిమ సంస్కారాలు కూడా తానే చేస్తానంటూ వివరించాడు. ఈ క్రమంలోనే అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అయితే అక్కడే ఉన్న బంధువులు, గ్రామస్తులు అంతా అన్నదమ్ములకు నచ్చజెప్పారు. కానీ వాళ్లలో ఏ ఒక్కరు వెనక్కి తగ్గలేదు. దీంతో పెద్ద కుమారుడు కిషన్ సింగ్ ఆస్తి పంపకాలాగే తండ్రి అంత్యక్రియలను పంచుకుందామని చెప్పాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందుకే అప్పుడు పవన్ కళ్యాణ్‌తో యాక్ట్ చేయలేదు

ప్రమాదవశాత్తు బావిలో పడిన పెద్దపులి, అడవిపంది… చివరిలో సూపర్‌ ట్విస్ట్‌