నమ్మి దేశం దాటి వస్తే..రెడ్ లైట్ ఏరియాకు అమ్మేయబోయాడు

|

Jun 13, 2023 | 8:48 PM

ఫేస్​బుక్​ ద్వారా పరిచయమైన ​ఓ యువకుడి మాటలు నమ్మి భారత్​కు వచ్చారు ఉజ్బెకిస్థాన్​కు చెందిన అక్కాచెల్లెళ్లు. వారిని వ్యభిచార గృహంలోకి దింపాలని ఆ యువకుడు ప్రయత్నిస్తుండగా.. బాధిత యువతులు బిహార్​ పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం జైలులో ఉన్న వారి కోసం ఆ యువతుల అక్క..

ఫేస్​బుక్​ ద్వారా పరిచయమైన ​ఓ యువకుడి మాటలు నమ్మి భారత్​కు వచ్చారు ఉజ్బెకిస్థాన్​కు చెందిన అక్కాచెల్లెళ్లు. వారిని వ్యభిచార గృహంలోకి దింపాలని ఆ యువకుడు ప్రయత్నిస్తుండగా.. బాధిత యువతులు బిహార్​ పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం జైలులో ఉన్న వారి కోసం ఆ యువతుల అక్క.. 3,000 కిలోమీటర్లు ప్రయాణించి ఉజ్బెకిస్థాన్ నుంచి భారత్​కు వచ్చింది. ఎలాగైనా వారిని తన వెంట పంపించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్​బుక్​ ద్వారా పరిచయమైన ఓ భారతీయ యువకుడి మాటలు నమ్మి.. ఉజ్బెకిస్థాన్​కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు భారత్​కు వచ్చారు. వీసా లేకుండా నేపాల్​ గుండా అక్రమంగా భారత్​లోకి ప్రవేశించారు. అనంతరం బిహార్​లో ఆ యువకుడిని కలుసుకున్నారు. ప్రణాళిక ప్రకారమే ఉజ్బెకిస్థాన్ యువతులను భారత్​కు రప్పించిన ఆ వ్యక్తి.. వారిని వ్యభిచారంలోకి దించాలని చూశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరుసగా రాజీనామా చేస్తున్న టీసీఎస్ మహిళా ఉద్యోగులు.. ఎందుకంటే ??

TOP 9 ET News: ‘ప్రేమలో ఉన్నా..’ ఒప్పేసుకున్న తమన్నా| అక్షరాలా రూ. 486కోట్లు ఇది ఏ హీరో వల్ల కాదు

Digital TOP 9 NEWS: గుజరాత్‌కు పెద్ద గండం | దేశంలోనే పెద్ద ఆస్పత్రి ఇక్కడే

 

Follow us on