ఇప్పటికైనా మారండ్రా..! రీల్స్ తీస్తుండగా ఢీకొట్టిన రైలు.. ఎగిరిపడి యువకుడు స్పాట్‌డెడ్

Updated on: Sep 25, 2025 | 10:11 PM

సోషల్ మీడియా రీల్స్ తీస్తున్న 21 ఏళ్ల ప్రిన్స్ అనే యువకుడు గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్‌పై వీడియో చిత్రీకరిస్తుండగా ఈ ఘోరం జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..యువకులు చాలా రోజులుగా ట్రాక్‌పై వీడియోలు తీస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఖతౌలి రైల్వే స్టేషన్‌ పరిధిలో మరో రీల్స్‌పిచ్చితో ప్రమాదం జరిగింది. సోషల్ మీడియా రీల్స్ తీస్తున్న 21 ఏళ్ల ప్రిన్స్ అనే యువకుడు గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్‌పై వీడియో చిత్రీకరిస్తుండగా ఈ ఘోరం జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..యువకులు చాలా రోజులుగా ట్రాక్‌పై వీడియోలు తీస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.