ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

Updated on: Feb 14, 2026 | 4:22 PM

ప్రయాగ్‌రాజ్‌లోని నాగేశ్వర్ నాథ్ ఆలయంలో భక్తులు తమ కోరికలు తీరాలని ఆలయ గ్రిల్స్‌కు తాళాలు వేస్తారు. మహాశివరాత్రి వేళ ఈ దృశ్యం సాధారణం. తాళం తమ సంకల్పానికి ప్రతీకగా, సమస్యలను శివుడికి అప్పగించి మానసిక ప్రశాంతత పొందేందుకు ఈ ఆచారం పాటిస్తారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి తాళాన్ని తెరుస్తారు.

ప్రయాగ్‌రాజ్‌లోని నాగేశ్వర్ నాథ్ ఆలయం ఒక వింత ఆచారానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలు నెరవేరాలని, మొక్కులు తీర్చుకోవాలని ఆలయ గ్రిల్స్‌కు తాళాలు వేస్తారు. ముఖ్యంగా మహా శివరాత్రి వేడుకల సమయంలో ఈ అపురూప దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. శివుడిని పూజించడంతో పాటు, తాళాలు వేయడం ఇక్కడి ప్రత్యేకత. సాధారణంగా భద్రతకు వాడే తాళాన్ని, ఇక్కడ భక్తులు తమ సంకల్పానికి, ప్రార్థనకు ప్రతీకగా భావిస్తారు. తమ కష్టాలకు తాళం పడి, అదృష్టపు తలుపులు తెరుచుకోవాలని వేలాది మంది భక్తులు ఈ పద్ధతిని పాటిస్తారు. ఈ ఆచారం వింతగా అనిపించినా, దాని వెనుక బలమైన నమ్మకం దాగి ఉందని స్థానికులు చెబుతారు. భక్తులు తమ మనసులోని గాఢమైన కోరికలను పరమ శివుడికి విన్నవించి, ఆ కోరికను దేవుడి పాదాల వద్ద భద్రపరిచినట్లు గా తాళాలు వేస్తారు.

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?