AP News: డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. తిరిగి సీట్ దగ్గరకు వెళ్లి చూడగా

|

Jul 17, 2024 | 6:07 PM

ప్రయాణం మధ్యలోనే భారీగా నగదు మాయం కావడం పెద్ద చర్చకు దారి తీసింది. హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సుమారు రూ. 36 లక్షల డబ్బు మాయం అయింది. సోదరికి డబ్బులు ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి.. ఆ వివరాలు ఇలా..

ప్రయాణం మధ్యలోనే భారీగా నగదు మాయం కావడం పెద్ద చర్చకు దారి తీసింది. హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సుమారు రూ. 36 లక్షల డబ్బు మాయం అయింది. సోదరికి డబ్బులు ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి సూపర్ లగ్జరీ బస్సులో కడపకు బయల్దేరాడు దామోదర్ అనే ట్రాన్స్‌కో ఉద్యోగి. సరిగ్గా బస్సు జడ్చర్ల బస్‌స్టాండ్‌కు చేరుకోగానే.. డబ్బులున్న బ్యాగ్ మాయం కావడాన్ని గుర్తించాడు సదరు బాధితుడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కాగా, బస్సులోని సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకుని.. విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on