జెనీలియా కంటతడి.. ఇంతకీ రితేష్ ఏమన్నారు?
రాజా శివాజీ సినిమా ట్రైలర్ లాంచ్ వేదికపై జెనీలియా కంటతడి పెట్టారు. భర్త రితేష్ దేశ్ముఖ్ భావోద్వేగానికి లోనై, సినిమా ప్రస్థానాన్ని, తండ్రితో అనుబంధాన్ని, జెనీలియా మద్దతును గుర్తుచేసుకోగా, ఆమె కన్నీరు ఆపుకోలేకపోయారు. సాధారణంగా నవ్వుతూ కనిపించే ఈ జంట ఇలా భావోద్వేగానికి గురవడం వైరల్గా మారింది.
నటి జెనీలియా దేశ్ముఖ్ ఇటీవల ఓ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. అది కూడా అందరూ చూస్తుండగా, పక్కకు తిరిగి మరీ ఏడ్చారు. ఈ ఘటన ఆమె భర్త, నటుడు రితేష్ దేశ్ముఖ్ నిర్మించి దర్శకత్వం వహించిన రాజా శివాజీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చోటుచేసుకుంది.మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న రాజా శివాజీ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రితేష్ దేశ్ముఖ్ భావోద్వేగానికి లోనయ్యారు. లాక్డౌన్ సమయంలో ఈ చిత్రానికి బీజం పడినప్పటి నుండి సినిమా ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ, తన భార్య జెనీలియా అందించిన మద్దతు గురించి కూడా ప్రస్తావించారు. భర్త రితేష్ ఎమోషనల్ అవుతుండటం చూసి జెనీలియా కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
మరిన్ని వీడియోల కోసం :
సడన్గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?
సమ్మర్ హీట్.. లైట్ అంటున్న స్టార్స్
