తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు రైతలను నిండా ముంచుతున్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. పొలాల్లో చేతికొచ్చిన పంట వరదపాలైంది. అటు వడగండ్ల వానతో లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమై రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అకాల కష్టంలో ఉన్న అన్నదాతకు భరోసా నింపాల్సిన పార్టీలు దీనిని కూడా రాజకీయాంశంగా మలుచుకుంటున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ ధాన్యం కొనుగోలు నుంచి పరిహారం దాకా అన్నీ రాజకీయం అయ్యాయి.