Big News Big Debate: టార్గెట్‌ డబుల్‌ డిజిట్‌.. వై నాట్‌ తెలంగాణ స్వీప్‌ అంటున్న కాషాయం

| Edited By: TV9 Telugu

Jan 04, 2024 | 11:42 AM

2024 పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై బీజేపీ దృష్టిపెట్టింది. కర్నాటక తర్వాత దక్షిణ భారతదేశంలో ఆ పార్టీకి కీలకంగా మారిన తెలంగాణపై గురిపెట్టింది అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా.. పార్లమెంట్‌లో డబుల్‌ డిజిట్‌తో సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. ఇందులో భాగంగా ముందుగానే అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి, వరుస సమావేశాలతో కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

2024 పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై బీజేపీ దృష్టిపెట్టింది. కర్నాటక తర్వాత దక్షిణ భారతదేశంలో ఆ పార్టీకి కీలకంగా మారిన తెలంగాణపై గురిపెట్టింది అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా.. పార్లమెంట్‌లో డబుల్‌ డిజిట్‌తో సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. ఇందులో భాగంగా ముందుగానే అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి, వరుస సమావేశాలతో కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. 2019లో నాలుగు సీట్లు సాధించిన బీజేపీ.. ఈ సారి 17 సీట్లు గెలుపు లక్ష్యంగా పెట్టుకుంది. అధికారం తోడైన కాంగ్రెస్‌, ఓటమికి ప్రతీకారంగా పార్లమెంట్‌లో స్వీప్‌ చేయాలని పట్టదలగా ఉన్న బీఆర్ఎస్‌కు బీజేపీ పోటీ ఇస్తుందా?.. ఈ రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో చూద్దాం…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Published on: Dec 28, 2023 06:43 PM