Lok Sabha: లోక్ సభ లో.. జగడ జగడ జగడం

Updated on: Feb 13, 2026 | 12:37 PM

లోక్‌సభ సమావేశాలు వరుస వివాదాలతో దద్దరిల్లాయి. అమెరికాతో ట్రేడ్ డీల్, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ, జనరల్ నరవణే పుస్తకంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రగడకు దారి తీశాయి. రాహుల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు, సభ్యత్వం రద్దు డిమాండ్‌లు వెల్లువెత్తాయి. నరవణే పుస్తకం లీకేజీపై కూడా దర్యాప్తు ప్రారంభమైంది.

లోక్‌సభ బడ్జెట్ సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య సాగాయి. బడ్జెట్‌పై చర్చ కన్నా వివాదాలే ఎక్కువ ఆధిపత్యం చెలాయించాయి. అమెరికాతో ట్రేడ్ డీల్, జనరల్ నరవణే రాసిన పుస్తకంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలు సభా హక్కుల నోటీసులకు దారి తీశాయి. రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చి, రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విడిపోయాకే సంతోషంగా ఉన్నా.. బాధ లేని బంధం

టాలీవుడ్‌లో ఆ సినిమాలకు కష్ట కాలం.. పాపం

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Chiranjeevi: ఉన్నట్టుండి చిరు ఎమోషనల్ పోస్ట్.. వైరల్