Telangana: కాంగ్రెస్లో చేరిన ప్రముఖ సినీనటి దివ్యవాణి
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న సినీనటి దివ్యవాణి.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్రావ్ ఠాక్రే సమక్షంలో ఆమె హస్తం పార్టీలో చేరారు. మాణిక్రావ్ ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న సినీనటి దివ్యవాణి.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్రావ్ ఠాక్రే సమక్షంలో ఆమె హస్తం పార్టీలో చేరారు. మాణిక్రావ్ ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ వాయిస్ బలంగా వినిపించేందుకు ప్రయత్నం చేసిన ఆమె.. ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి రోల్ పోషిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
దివ్యవాణి గతంలో ఏపీ టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అయితే మహానాడులో ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం.. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ తెలుగుదేశంను వీడారు. ఆ తర్వాత బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి అగ్రనేతలతో సమావేశమయ్యారు. కానీ ముందడుగు పడలేదు. తాజాగా దివ్యవాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!
పాట్నా స్టేషన్లో వింత దృశ్యం..ప్లాట్ఫామ్ నిండా పాదముద్రలే
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. అప్పుడే ఓ అద్భుతం
ఆరు బ్యాంక్లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..

