Telangana: కాంగ్రెస్లో చేరిన ప్రముఖ సినీనటి దివ్యవాణి
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న సినీనటి దివ్యవాణి.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్రావ్ ఠాక్రే సమక్షంలో ఆమె హస్తం పార్టీలో చేరారు. మాణిక్రావ్ ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న సినీనటి దివ్యవాణి.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్రావ్ ఠాక్రే సమక్షంలో ఆమె హస్తం పార్టీలో చేరారు. మాణిక్రావ్ ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ వాయిస్ బలంగా వినిపించేందుకు ప్రయత్నం చేసిన ఆమె.. ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి రోల్ పోషిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
దివ్యవాణి గతంలో ఏపీ టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అయితే మహానాడులో ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం.. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ తెలుగుదేశంను వీడారు. ఆ తర్వాత బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి అగ్రనేతలతో సమావేశమయ్యారు. కానీ ముందడుగు పడలేదు. తాజాగా దివ్యవాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!

