Big News Big Debate: గవర్నర్‌ Vs గవర్నమెంట్‌ వివాదంలో మలుపు.. 3న అసెంబ్లీ సమావేశాలపై అనుమానాలు

|

Jan 30, 2023 | 6:56 PM

పంతాలకు పోయి కోర్టు దాకా వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరినట్టు అయితే వాతావరణం కనిపిస్తోంది. చాలాకాలంగా అటు గవర్నర్ తమిళిసై - ఇటు తెలంగాణ ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడుస్తోంది.

పంతాలకు పోయి కోర్టు దాకా వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరినట్టు అయితే వాతావరణం కనిపిస్తోంది. చాలాకాలంగా అటు గవర్నర్ తమిళిసై – ఇటు తెలంగాణ ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడుస్తోంది. దీని ఇంపాక్ట్‌ చివరకు అత్యంత కీలకమైన బడ్జెట్‌పైనా పడింది. గవర్నర్‌ అనుమతి లేకుండా బడ్జెట్‌ అసెంబ్లీకి రాదు.. తన ప్రసంగం సంగతి చెబితేనే సంతకం అంటూ గవర్నర్‌ సంకేతాలు బలంగా పంపారు. చివరకు ఎవరికి వారే పంతానికి పోయి కోర్టు మెట్లక్కాల్సి వచ్చింది. ఇంతలో ఏమయిందో ఏమో అటు ప్రభుత్వం.. ఇటు రాజ్‌భవన్‌ న్యాయవాదులు కోర్టు ముందు రాజీపడుతున్నట్టు ప్రకటించి ఆశ్చర్చపరిచారు.

Follow us on