ఏపీలో మరోసారి పార్టీల మధ్య మాటలమంటలందుకున్నాయి. వైసీపీ పాలనను ఉద్దేశించి ఇదేం ఖర్మరా అంటూ టీడీపీ క్యాంపెయన్ మొదలుపెడితే అదే డైలాగుతో ఫుల్ కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కర్నూలులో తన కాన్వాయ్ అడ్డుకున్న ఆందోళనకారులపై చంద్రబాబు చేసిన విమర్శలపైనా స్ట్రాంగ్ ఎటాక్ చేశారు సీఎం. తెలుగుదేశం పార్టీ తెలుగు బూతుల పార్టీగా మారితే.. జనసేన ఏకంగా రౌడీసేన అయిందన్నారు సీఎం జగన్. అధికారం కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండి మీకు మంచి చేసేవాళ్లను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.