జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ వైసీపీ నేతలు ఇంటింటి తలుపు తడుతూ మద్దతు కూడగడుతున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు కూడా స్పీడు పెంచారు. ఈ పొలిటికల్ యాక్షన్లోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఛార్జిషీట్లు వేసేందుకు ప్రత్యేక బలగాలను రంగంలో దింపింది. జాతీయ నాయకుల నుంచి జిల్లా నాయకుల వరకూ అందరికీ యాక్టివేట్ చేస్తోంది. అయితే బీజేపీ రోడ్ మ్యాప్ అడిగిన పవన్.. ప్రచారానికి దూరంగా ఉన్నారు. పైగా పొత్తులపై త్వరలో నిర్ణయం అంటూ ప్రకటన విడుదల చేశారు.