Nandigama: రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తున్న మహిళ.. పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు.. ఒక్కసారిగా

Updated on: Sep 08, 2025 | 12:29 PM

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో, ఒక మహిళ మెడలో లాక్కున్న గొలుసును దొంగలు చోరీ చేసి పారిపోయారు. ఘటన పోస్ట్ ఆఫీస్ ఎదురుగా చోటుచేసుకుంది. దొంగలు పల్సర్ బైక్‌పై వెళ్లిపోవడం లోకల్ సీసీ కెమెరా ఫుటేజ్‌లో రికార్డయింది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చుశారుగా.. తెంపుడుగాళ్ల బరితెగింపు. మహిళలు ఒంటరిగా బయటకు వస్తే చాలు.. మెడలో మంగళసూత్రాలు తెంపుకెళ్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఒక మహిళ మెడలోని గోలుసును లాక్కుని పారిపోయారు దుండగులు. ఘటన పోస్ట్ ఆఫీస్ ఎదురుగా చోటుచేసుకుంది. దొంగలు పల్సర్ బైక్‌పై వెళ్లిపోవడం లోకల్ సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది.

గత ఆరు నెలలుగా నందిగామలో చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. భద్రతా చర్యలను పెంచాలని కోరుతున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్, సాక్ష్యాలు సేకరించి.. దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి