గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌నుంచి యూరప్‌కి డైరెక్ట్‌ ఫ్లైట్‌

Updated on: Sep 06, 2025 | 1:08 PM

యూరప్‌‌ దేశాలకు వెళ్లాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. ఇకపై.. హైదరాబాద్ నుంచి నాన్‌స్టాప్‌గా ఒకే ఫ్లైట్‌లో ఆమ్‌స్టర్‌డామ్‌ వెళ్లిపోవచ్చు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్’ హైదరాబాద్ నుంచి నేరుగా ఆమ్‌స్టర్‌డామ్‌కు వారానికి 3 విమాన సర్వీసులను ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

దీంతో.. తెలుగు వారికి యూరప్ ప్రయాణం మరింత సులభతరం కానుంది. భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో భాగంగా కేఎల్‌ఎం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల నుంచి తమ విమాన సేవలు అందుబాటులో ఉండగా, హైదరాబాద్ తమకు నాలుగో గేట్‌వే అని కేఎల్‌ఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్టెన్ స్టీనెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ 4 నగరాల నుంచి వారానికి 24 విమానాలను ఆమ్‌స్టర్‌డామ్‌కు నడుపుతున్నామని, శీతాకాలంలో ఈ సంఖ్యను 27కి పెంచనున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ నగరం ఫార్మా, ఐటీ రంగాలకు కీలక కేంద్రంగా ఎదుగుతోందని, ఇక్కడి నుంచి సరుకు రవాణాకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మార్టెన్ స్టీనెన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్-ఆమ్‌స్టర్‌డామ్ మార్గంలో బోయింగ్ 777-200ER విమానాలను ఉపయోగిస్తున్నామని, ఇందులో వివిధ తరగతుల్లో కలిపి ఒకేసారి 288 మంది ప్రయాణించవచ్చని కేఎల్‌ఎం అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కనెక్టివిటీ వ్యాపార, పర్యాటక రంగాలకు ఎంతో ఊతమిస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

6 రోజుల్లో రూ.6 వేలు పెరిగిన పుత్తడి.. ఆల్‌టైం రికార్డ్ దిశగా అడుగులు

‘కల్లు కొట్టు కాడా..’ మార్కెట్లోకి నయా మాస్ మాసాలా సాంగ్! అదిరిపోయే రెస్పాన్స్!

ఇన్‌స్టాలో పరిచయం.. పార్టీ పేరుతో స్కెచ్‌.. బాత్రూమ్‌లోకి పడేసి.. అత్యాచారం?

Dulquer Salmaan: వివాదంలో కొత్త లోక.. దిగొచ్చి క్షమాపణ చెప్పిన దుల్కర్

ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ఓటీటీలో అత్యంత భయానక హారర్ థ్రిల్లర్ మూవీ..