కారులో పెట్రోలు కొట్టిస్తుండగా భగ్గున చెలరేగిన మంటలు

Updated on: Oct 07, 2025 | 7:47 PM

హైదరాబాద్‌ నగరంలోని పంజాగుట్ట పరిధిలో గల ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. ఎర్రమంజిల్ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంకులో కారులో పెట్రోల్ నింపుతుండగా మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే ఆ మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంతం అంతా పొగతో నిండిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉండగా, వారు వెంటనే అప్రమత్తమై కారు దిగి సురక్షితంగా బయటపడ్డారు.

అసలు ఎందుకిలా జరిగింది? పెట్రోల్ బంకులో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా ఇలా జరగడానికి కారణమేంటి? కారులో పెట్రోలు కొడుతుండగా మంటలు చెలరేగడంతో బంకు సిబ్బంది, ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు, పెట్రోల్ బంకు సిబ్బంది, కలిసి కారును నెట్టుకుంటూ బంకునుంచి దూరంగా తోసుకుంటూ వెళ్లారు. కారు ముందు భాగంలో పెద్ద ఎత్తున పొగలు, మంటలు చెలరేగాయి. సిబ్బంది బకెట్లతో నీళ్లను తీసుకొచ్చి మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్న వ్యక్తులు అప్రమత్తమై వెంటనే కారు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యువతి అనారోగ్యాన్ని మంత్రంతో పోగొడతానన్నాడు.. చివరికి..

ఓరి బుడ్డోడా.. మ్యాగీ కోసం ఎంత పనిచేశాడు

ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై పీఎఫ్ సేవలు మరింత సులభం

అపర కుబేరుడు.. ఈ ఆటోవాలా.. నెలకు రూ. 3 లక్షల ఆదాయం

Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం.. ఇక పర్యాటకం పరుగులే