PM Modi: చదువుకు దూరమయ్యాం.. ప్రధాని మోదీ ముందు చిన్నారుల కంటతడి..

Updated on: Sep 13, 2025 | 9:49 PM

అల్లర్లలో అట్టుడికిన మణిపూర్‌లో రెండేళ్ల తరువాత పర్యటిస్తున్న ప్రధాని మోదీకి తమ గోడును వెళ్లబోసుకున్నారు స్థానికులు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి వెల్లడించారు బాధితులు. స్కూళ్లు మూతపడడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు ప్రధాని మోదీ ముందు కంటతడి పెట్టారు. చిన్నారుల బాధను చూసి మోదీ చలించిపోయారు..

అల్లర్లలో అట్టుడికిన మణిపూర్‌లో రెండేళ్ల తరువాత పర్యటిస్తున్న ప్రధాని మోదీకి తమ గోడును వెళ్లబోసుకున్నారు స్థానికులు. అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయామని ప్రధానికి వెల్లడించారు బాధితులు. స్కూళ్లు మూతపడడంతో విద్యకు దూరమయ్యామని చిన్నారులు ప్రధాని మోదీ ముందు కంటతడి పెట్టారు. చిన్నారుల బాధను చూసి మోదీ చలించిపోయారు.. మణిపూర్‌ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని , మోదీ మీకు అండగా ఉంటాడని వాళ్లను భరోసా ఇచ్చారు. శాంతి తోనే అభివృద్ది సాధ్యమన్నారు. మణిపూర్‌ ప్రజలకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మోదీ.

Loading...
Unable to load recommendations.
Follow Us