RK Roja: తమిళనాడులోని తిరుత్తణి ఆలయంలో రోజా పూజలు

|

Aug 11, 2024 | 9:58 PM

ఎన్నికల్లో ఓటమి తర్వాత నటి రోజా సైలెంట్ అయ్యారు. బయట ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ఆమె తమిళనాట యాక్టివ్ అవ్వడం.. చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆమె పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ అవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మాజీ మంత్రి రోజా ఆధ్మాత్మిక టూర్‌ చేశారు.

మాజీ మంత్రి రోజా ఆధ్మాత్మిక టూర్‌ చేశారు. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆడిషష్ఠి సందర్భంగా కావడి మొక్కులు చెల్లించుకున్నారు. సుబ్రమణ్యస్వామి వ్రతమాచరించిన ఆమె పుష్పాలతో అలంకరించిన కావడి ఎత్తారు. రోజా కుటుంబ సభ్యులను అధికారులు స్వాగతం పలికారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో వేద మంత్రాల మధ్య రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన రోజాకు ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. తొలి నుంచి భక్తి భావంగా ఉన్న రోజా… తమిళనాడు – ఏపీలోని ప్రముఖ దేవాలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

 

Follow us on