Hrithik Roshan: హృతిక్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్

Updated on: Feb 12, 2026 | 8:33 PM

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం క్రిష్ 4 పనుల్లో బిజీగా ఉన్న ఆయన, జిందగీ నా మిలేంగీ దుబారా సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. ముగ్గురు హీరోల జీవితాల్లో మార్పులపై కథ సిద్ధంగా ఉన్నా, షూటింగ్ ప్రారంభించడానికి సమయం పట్టే అవకాశం ఉంది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం క్రిష్ 4 సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరో ఆసక్తికరమైన సినిమా అప్డేట్‌ను వెల్లడించారు. ఒకప్పుడు యువ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బ్లాక్ బస్టర్ ట్రావెల్ డ్రామా జిందగీ నా మిలేంగీ దుబారాకు సీక్వెల్ సిద్ధమవుతున్నట్లు హింట్ ఇచ్చారు. హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జిందగీ నా మిలేంగీ దుబారా అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన చాలా కాలంగా ఉన్నప్పటికీ, సరైన కథ కుదరకపోవడంతో ఆలస్యమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Suriya: సూర్య కోసం వెయిటింగ్ లో ఉన్న దర్శకులు

Rukmini Vasanth: రష్మికను ఫాలో అవుతున్న రుక్మిణీ వసంత్

Toxic: రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న టాక్సిక్

Sai Pallavi: స్పీడు పెంచిన సాయి పల్లవి.. వరుస చిత్రాలతో షేక్ చేస్తుంది

సచిన్ ఇంట పెళ్లి సందడి.. మోదీ, ముర్ములకు ఆహ్వానం

Follow Us