సినిమాలపై సమంత కీలక నిర్ణయం..! ఇదేదో ఎప్పుడో చేస్తే అయిపోయేదిగా..

Updated on: Aug 23, 2025 | 11:43 AM

స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ విషయంలో ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయకుండా, తన ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల ‘గ్రాజియా ఇండియా’ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. తన ఈ స్టేట్మెంట్‌తో ఇప్పుడు నెట్టిట తెగ వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ,.

ఇకపై ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయనని చెప్పిన సమంత.. తన శరీరం చెప్పే మాట కూడా వినాలనే విషయం తాను తెలుసుకున్నా అన్నారు. అందుకే పనిభారాన్ని తగ్గించుకుంటున్నానని తెలిపారు. తన శారీరక, మానసిక ఆరోగ్యానికే తన మొదటి ప్రాధాన్యత ఇస్తా అన్నారు. అయితే, ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా వాటి నాణ్యత విషయంలో మాత్రం కచ్చితంగా పెరుగుదల ఉంటుందని స్పష్టం చేశారు. తక్కువ సినిమాలు చేసినా, ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలతోనే తాను వస్తానన్నారు. ఎన్ని సినిమాలు చేశామనేది కాదని.. ఎంత మంచి చిత్రాలు తీశామనేది ముఖ్యమన్నారు సమంత. పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న సామ్‌.. ప్రస్తుతం సినిమాలతో పాటు ఆరోగ్యంపైనా దృష్టిసారించినట్టు తెలిపారు. గతంలో కన్నా ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చిందని, గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నానని వివరించారు. ఫిట్‌నెస్‌, సినిమాలు రెండిటిపైనా దృష్టిపెట్టడమే కాకుండా, మంచి సినిమాలు, సిరీస్‌లలో భాగమయ్యానని తెలిపారు. అవన్నీ కేవలం పాషన్ కోసమో, గుర్తింపు కోసమో చేసేవి కావని, అన్నీ తన మనసుకు దగ్గరగా ఉన్న కథలేనని వివరించారు. అయితే సామ్ మాటలపై ఆమె ఫ్యాన్స్ కాస్త తెలివిగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికి బోధ పడిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో ఇదేదో ఎప్పుడో చేస్తే ఇంకా బాగుండేది కదా అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అగ్నిపరీక్ష’ను అధిగమించిన మాస్క్ మ్యాన్.. ? ఇక పక్కగా బిగ్‌బాస్‌లోకే

Rahul Sipligunj: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందో లేదో.. అప్పుడే ప్రత్యేక పూజలు..

Venu Swamy: వేణు స్వామికి ఘోర అవమానం.. గుడి నుంచి గెంటేసిన అర్చకులు

కోపంగా ఉన్న ఫ్యాన్స్‌ను.. చిరు లీక్‌తో కూల్ చేసిన మెగాస్టార్

Sitara Ghattamaneni: అభిమానులకు.. మహేష్ కూతురు హెచ్చరిక