Salman Khan: వంశీ పైడిపల్లి మీదే హోప్స్ పెట్టుకున్న భాయీజాన్
సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' సినిమా రక్షణ మంత్రిత్వ శాఖ సూచనలతో 40% రీషూట్తో వాయిదా పడింది. ఇటీవలి చిత్రాలు విజయం సాధించకపోవడంతో సల్మాన్ హిట్ కోసం చూస్తున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంపైనే భాయీజాన్ భారీ ఆశలు పెట్టుకున్నారు. 'మాతృభూమి' ఆలస్యం సల్మాన్ కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న మాతృభూమి వాయిదా పడుతుందా? ఎన్నేళ్లుగానో ఒకే ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న సల్మాన్ఖాన్కి హిట్ అందని ద్రాక్ష పండే అవుతుందా? ఇప్పుడు మాతృభూమి విషయంలో వచ్చిన చిక్కులేంటి? ఆయన కంప్లీట్గా మన కెప్టెన్ మీదే ఆశలు పెంచుకుంటున్నారా? డీటైల్డ్ గా మాట్లాడుకుందాం వచ్చేయండి. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మాతృభూమి రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. ఇటీవల ఈ సినిమా చూసిన రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధులు.. భారీగా మార్పులు సూచించారని బాలీవుడ్ టాక్. దాదాపు 40 శాతం సినిమా రీషూట్ చేయాల్సి ఉంటుందని, అందుకే ఇప్పట్లో రిలీజ్ ఉండకపోవచ్చని మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ కొన్నేళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు భాయీజాన్. సికిందర్గానీ, అంతకు ముందు చేసిన టైగర్ 3 గానీ, కిసి కా భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3గానీ అనుకున్నంత హిట్ కాలేకపోయాయి. అందుకే కమింగ్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్. రాజా శివాజీ, మాతృభూమి నార్త్ ప్రాజెక్టులు. ఆ సినిమాల సంగతి ఎలా ఉన్నా, వంశీ పైడిపల్లితో మాత్రం మాసివ్ హిట్ కొట్టి చూపించాలనే తపన కనిపిస్తోంది సల్మాన్ భాయ్లో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..
సామాన్య పాస్టర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
Srikalahasti: పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ
