Roja: స్టేజ్‌పై తన డ్యాన్సింగ్‌తో.. అందర్నీ అరిపించిన రోజా !!

Updated on: Nov 21, 2022 | 8:27 PM

ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తిరుపతి లో నిర్వహించిన జగనన్న స్వర్ణోత్సవాల వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తిరుపతి లో నిర్వహించిన జగనన్న స్వర్ణోత్సవాల వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఎక్కడికి వెళ్లినా తనదైన స్టైల్‌లో ప్రత్యేకతను చాటుకునే మంత్రి కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక సంబురాల్లో భాగస్వామిగా మారారు. స్టేజ్‌పైకి ఎక్కి మరికొందరు బాలికలతో కలిసి స్టెప్పులు వేశారు మంత్రి. సినిమాల్లో పాపులర్ హీరోయిన్‌గా చాలా హీరోల పక్కన స్టెప్పులు వేసిన రోజా మంత్రి అయినా తర్వాత కూడా చీరలో అంతే జోష్‌తో డ్యాన్స్ చేయడం అందర్ని ఆకట్టుకుంది. ఇప్పుడు సోషల్ మీడియా గ్రూప్‌లలో ఏపీ మంత్రి డ్యాన్స్ వీడియోలే వైరల్ అవుతున్నాయి.

Published on: Nov 21, 2022 08:27 PM
Follow Us