Amala: నేను కోడళ్లపై పెత్తనం చెలాయించే అత్తను కాను
టాలీవుడ్ సీనియర్ నటి అక్కినేని అమల తన కోడళ్లైన శోభిత ధూళిపాల, జైనబ్లతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాల గురించి చెప్పారు. కోడళ్ల రాకతో తన ఇంట్లో ఓ ‘గర్ల్స్ సర్కిల్’ ఏర్పడిందని, తన జీవితం కొత్తగా అనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబానికే పూర్తి సమయం కేటాయిస్తున్న అమల, తన కోడళ్లపై ప్రశంసలు కురిపించారు.
తన కోడళ్లు అద్భుతం అని.. వాళ్ల వ్యక్తిత్వం చాలా మంచిదని అమల తెలిపారు. వాళ్ల పనుల్లో వాళ్లు బిజీగా ఉండటం తనకు సంతోషాన్నిస్తుందని, యువత ఎప్పుడూ ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. వాళ్లు తమ పనుల్లో ఉన్నప్పుడు తను తన పనుల్లో ఉంటాననీ సమయం దొరికినప్పుడు అందరం కలిసి సరదాగా గడుపుతామనీ అన్నారు. తను డిమాండ్స్ చేసే అత్తను కాదనీ.. అలాగే డిమాండ్ చేసే భార్యను కూడా కాదని నవ్వుతూ చెప్పారు. తన కుమారులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ మంచి యువకులుగా ఎదిగినందుకు గర్వంగా ఉందన్నారు. నాగార్జునకు తన పిల్లలంటే ఎంతో ప్రేమ అని, తాను కూడా తల్లిగా తన బాధ్యతలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో చివరిసారిగా కనిపించిన అమల, అప్పటి నుంచి కొత్త ప్రాజెక్టులను అంగీకరించలేదు. నాగ చైతన్య 2024లో నటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకోగా, అఖిల్ అక్కినేని 2025లో ముంబైకి చెందిన ఆర్టిస్ట్ జైనబ్ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తన జీవితం చాలా ప్రశాంతంగా, సంతోషంగా సాగిపోతోందని అమల చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోనసీమకు విదేశీ అతిథులు 12 వేల కి.మీ దూరం నుంచి …
తండ్రికి బెదిరింపు లేఖ.. రూ.35 లక్షలు డిమాండ్ చేసిన కొడుకు
ఖరీదైన కాఫీ..కిలో జస్ట్ రూ.25 లక్షలే
క్యాన్సర్ గెలిచింది.. ఇదే నా చివరి దీపావళి యువకుడి ఎమోషనల్ పోస్ట్
