గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండా 3115 రైల్వే ఉద్యోగాల భర్తీ

Updated on: Aug 07, 2025 | 6:00 PM

కొంత కాలంగా రైల్వేలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈస్టర్న్‌ రైల్వే కోల్‌కతా..మరో నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి, ఇంటర్ అర్హతతో మొత్తం 3115 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు.ఫిట్టర్‌, వెల్డర్‌, మెకానికల్, మెషినిస్ట్, కార్పెంటర్‌, పెయింటర్‌, లైన్‌మెన్‌, వైర్‌మెన్‌, ఆర్‌ఈఎఫ్‌&ఏసీ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌.. విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 14, 2025వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డివిజన్ ల వారీగా చూస్తే… హౌరా డివిజన్‌ 659 పోస్టులు, లిలువా వర్క్‌షాప్‌ లో 612, సీల్డా డివిజన్‌ 440 పోస్టులు, కాంచ్రపార వర్క్‌షాప్ లో 187 పోస్టులు, మాల్డా డివిజన్ 138 పోస్టులు, అసన్‌సోల్‌ డివిజన్‌ లో 412 పోస్టులు, జమలాపూన్‌ వర్క్‌షాప్‌ లో 667 పోస్టులను నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి పదితోపాటు సంబంధిత విభాగంలో ఇంటర్‌, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 24 ఏళ్లు. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ. 100 రూపాయిలు చెల్లించాలి. మిగిలినవారికి ఎలాంటి ఫీజూ లేదు. రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల్లోని ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘దేవుడి దగ్గరికి వెళ్తున్నా..’ ఐదో అంతస్తు నుంచి దూకిన మహిళ

రోజుకు రూ. 411 కడితే.. చేతికి రూ.43 లక్షలు.. ఈ అదిరిపోయే స్కీమ్ ఏదంటే..

మయసభ రివ్యూ.. పొలిటిక‌ల్ డ్రామా ఎలా ఉందంటే?