Hyderabad: ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రోరైల్ స్టేషన్లు.. కారణమేంటి

Updated on: Oct 07, 2025 | 5:41 PM

దసరా సెలవులు, లాంగ్ వీకెండ్ కారణంగా హైదరాబాద్ పరిసర రహదారులు, టోల్ ప్లాజాలు ట్రాఫిక్‌తో స్తంభించాయి. నగరంలోకి చేరుకున్న ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందుల నుండి తప్పించుకునేందుకు, గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు, రైళ్లలో రద్దీ భారీగా పెరిగింది.

వరుస దసరా సెలవులు, ఆ వెంటనే వచ్చిన లాంగ్ వీకెండ్ ముగియడంతో హైదరాబాద్‌కు ట్రాఫిక్ తాకిడి మళ్లీ మొదలైంది. నగరం వైపునకు వచ్చే అన్ని జాతీయ రహదారులు, టోల్ ప్లాజాలు వాహనాలతో నిండిపోయి భారీ ట్రాఫిక్ జామ్‌లను సృష్టించాయి. ఈ ట్రాఫిక్ జామ్‌లలో గంటల తరబడి చిక్కుకున్న ప్రయాణికులు, నగరంలోకి ప్రవేశించిన తర్వాత తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకోవడానికి మెట్రోరైల్‌ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. మెట్రో ద్వారా తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చనే ఉద్దేశంతో ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు పోటెత్తుతున్నారు. ఎల్.బి. నగర్ వంటి ప్రధాన మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగి, ప్లాట్‌ఫామ్‌లపై జనాల క్యూలు బారులు తీరాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎర్రచందనం స్మగ్లింగ్ లో పోలీసులకు దొరికిన ఇద్దరు పుష్ప రాజ్‌లు

KTR: RTCని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది

జాతర వైబ్ కంటిన్యూ.. సెప్టెంబర్ విజయ పరంపర కొనసాగిస్తున్న చిత్రాలు

థియేటర్‌లోకి పంజుర్లి.. షాకైన ఆడియన్స్

2027 ప్రపంచకప్ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్