SBI OFFER: ఎస్‌బీఐ ఖాతాదారులకు బంపర్‌ ఆఫర్‌..! తనఖా పెట్టిన నివాస, వాణిజ్య ఆస్తుల వేలం.. (వీడియో)

|

Dec 18, 2021 | 8:39 AM

సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా... అయితే ఈ న్యూస్‌ మీ కోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం భారీ ఆఫర్‌తో తీసుకొచ్చింది. ఖరీదైన ఆస్తులను చౌకగా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా… అయితే ఈ న్యూస్‌ మీ కోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం భారీ ఆఫర్‌తో తీసుకొచ్చింది. ఖరీదైన ఆస్తులను చౌకగా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. బ్యాంక్‌లో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అక్టోబర్ 25 న వాణిజ్య, నివాస స్థలాల కోసం ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తోంది. వేలానికి సంబంధించి ఓ ప్రకటనను ఎస్‌బీఐ విడుదల చేసింది. వేలం కోసం జారీ చేసిన పబ్లిక్ నోటీసులో ఇతర అన్ని వివరాలను పేర్కొంది. అయితే SBI ఇచ్చిన ప్రకటన ప్రకారం.. బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తుల వేలం కోర్టు అనుమతి తర్వాతే జరుగుతుంది.

బ్యాంకు ప్రజలకు రుణాలు ఇచ్చేముందు గ్యారెంటీ రూపంలో వారికి సంబంధించిన ఆస్తులను తనఖా పెట్టుకుంటుంది. రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే బ్యాంక్ తన తనఖా ఆస్తిని రికవరీ కోసం వేలం వేస్తుంది. బ్యాంకు సంబంధిత శాఖలు వార్తాపత్రికలు ఇతర మాధ్యమాల ద్వారా ప్రకటనలను ప్రచురిస్తాయి. ఆస్తుల వేలానికి సంబంధించిన సమాచారం ఈ ప్రకటనలో ఇస్తారు. SBI నిర్వహించే ఇ-వేలంలో పాల్గొనాలంటే నోటీసులో ఇచ్చిన సంబంధిత ఆస్తి కోసం EMD సమర్పించాలి. ‘KYC డాక్యుమెంట్లు’ సంబంధిత బ్యాంక్ శాఖలో చూపించాల్సి ఉంటుంది. వేలంలో పాల్గొనే వ్యక్తి తప్పనిసరిగా డిజిటల్ సంతకాన్ని కలిగి ఉండాలి. లేకపోతే, ఇ-వేలం నిర్వహించే వ్యక్తి లేదా ఏదైనా ఇతర అధీకృత ఏజెన్సీని దీని కోసం సంప్రదించవచ్చు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

News Watch: ఈటల, రేవంత్‌ రహస్య భేటీ – కేటీఆర్ మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్.. (లైవ్ వీడియో)

Follow us on