రైల్వే సరికొత్త ఆఫర్.. టికెట్ ధరలో రాయితీ
పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఇబ్బందులు లేని బుకింగ్ అనుభవాన్ని అందించే లక్ష్యంతో 'రౌండ్ ట్రిప్ ప్యాకేజీ' అనే సరికొత్త పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ పథకం కింద వెళ్లే, వచ్చే ప్రయాణాలకు కలిపి టికెట్లు బుక్ చేసుకునే వారికి తిరుగు ప్రయాణం బేస్ ఫేర్లో 20 శాతం రాయితీ లభిస్తుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ప్రయాణికులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వెళ్లే ప్రయాణానికి, తిరుగు ప్రయాణానికి ఒకేసారి టికెట్లు బుక్ చేసుకోవాలి. ప్రయాణికుల వివరాలు, ప్రయాణించే క్లాస్, బయలుదేరే స్థానం, గమ్యస్థానం రెండింటికీ ఒకేలా ఉండాలి. ఈ పథకం కింద టికెట్ల బుకింగ్ ఈ రోజు నుండి (ఆగష్టు 14) ప్రారంభమవుతుంది.ఈ ఆఫర్ నిర్దిష్ట తేదీలలో ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 26 మధ్య ప్రారంభమయ్యే రైళ్లలో వెళ్లే ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవాలి. అనంతరం, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ప్రారంభమయ్యే రైళ్లలో తిరుగు ప్రయాణానికి ‘కనెక్టింగ్ జర్నీ’ ఫీచర్ను ఉపయోగించి టికెట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణ టికెట్ బుకింగ్కు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) వర్తించదని రైల్వే స్పష్టం చేసింది. అయితే, ఈ పథకానికి కొన్ని కఠినమైన షరతులు కూడా ఉన్నాయి. ఈ స్కీమ్ కింద బుక్ చేసుకున్న టికెట్లకు ఎలాంటి రీఫండ్ ఇవ్వబడదు. అలాగే, టికెట్లలో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. రెండు వైపులా కన్ఫర్మ్ అయిన టికెట్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉన్న రైళ్లు మినహా అన్ని రైళ్లు, అన్ని క్లాసులలో ఈ పథకం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్.. ఏ పద్ధతిలోనైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కానీ, రెండు టికెట్లనూ ఒకే విధానంలో బుక్ చేయాల్సి ఉంటుంది. పండుగల సమయంలో రద్దీని నియంత్రించి, రైళ్ల వినియోగాన్ని రెండు వైపులా పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని రైల్వే శాఖ వివరించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

