టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

Updated on: Sep 25, 2025 | 10:04 AM

బెంగుళూరులో ఓ వివాహిత తన భర్త తొలి రాత్రి శారీరక సంబంధానికి నిరాకరించాడని రూ. 2 కోట్లు పరిహారం డిమాండ్ చేసింది. మూడు నెలల తర్వాత ఈ డిమాండ్ చేయడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది.

బెంగుళూరు నగరంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వివాదం సమాజంలో చర్చనీయాంశంగా మారింది. చిక్మంగళూరుకు చెందిన ప్రవీణ్ , చందన అనే జంట మే 5వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ బెంగుళూరులోని సప్తగిరి ప్యాలెస్‌లో కాపురం పెట్టారు. వివాహం తర్వాత తొలి రాత్రి ప్రవీణ్ శారీరక సంబంధానికి నిరాకరించడంతో వారి మధ్య వివాదం మొదలైంది. ఈ విషయంపై చందన వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరింది. వైద్య పరీక్షలలో ప్రవీణ్ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. అయితే, మానసిక ఒత్తిడి కారణంగా కొంత సమయం ఇవ్వాలని వైద్యులు సూచించారు. మూడు నెలల తర్వాత, చందన తన భర్త ప్రవీణ్‌ను ఒత్తిడి చేసి రూ. 2 కోట్లు పరిహారంగా డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కు ఆమె కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్నివీడియోల కోసం :

Super Prime Time : అడవిలో అన్నలకు ఇవి ఆఖరి రోజులేనా వీడియో

సినిమా టికెట్లపై రూ.200 పరిమితి మీద హైకోర్టు స్టే వీడియో

Earthquake In Ongole : ఒంగోలులో భూ ప్రకంపనలు వీడియో

Published on: Sep 25, 2025 08:15 AM
Follow Us