Telangana: పైకి చూసి మిర్చి పంట ఏపుగా పెరిగిందనుకునేరు.. లోపలికి వెళ్లి చూడగా

Updated on: May 13, 2025 | 5:45 PM

పంట ఏపుగా పెరిగిందని అనుకుంటే పొరబడినట్టే.. ఆ పంట లోపల యవ్వారం కానిస్తున్నారు కొందరు. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పోచంపల్లి చిన్న గొదుమలై గ్రామంలో పంట చేనులో 16 గంజాయి మొక్కలను సాగు చేస్తూ ఇద్దరు రైతులు పోలీసులకు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. 16 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఇద్దరు రైతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు పోలీస్ అధికారులు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి మొక్కలు పెంచినా.. విక్రయించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ ASP అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us