AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పైకి చూసి దొంగ కోళ్లు కొట్టేవాడనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్‌పోతుంది

Hyderabad: పైకి చూసి దొంగ కోళ్లు కొట్టేవాడనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్‌పోతుంది

Ravi Kiran
|

Updated on: Sep 26, 2025 | 8:47 AM

Share

18 ఏళ్ల యువకుడు.. అలా వెళ్తుండగా .. వాడి చూపులు కొంచెం అనుమానంగా కనిపించాయి. మరి పోలీసులు ఎంక్వైరీ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఏంటో.? ఈ ఘటన ఎక్కడ జరిగిందో.? ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం. మరి లేట్ ఎందుకు ఓ సారి లుక్కేయండి.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 18 ఏళ్ల ప్రమోద్ కుమార్ నుంచి 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆగపల్లి వద్ద నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మరో నిందితుడు కిరణ్ నాయక్ పరారీలో ఉన్నాడు. గంజాయితో సహా పట్టుబడ్డ ప్రమోద్ కుమార్‌ను ఎస్ఓటీ పోలీసులు మంచాల పోలీసులకు అప్పగించారు.