జమ్మూ కాశ్మీర్​​లో ఎన్​కౌంటర్..ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

జమ్మూ కాశ్మీర్​​ షోపియన్​ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత సైన్యం​. షాపియన్​లోని డైరూ ప్రాంతంలో టెర్ర‌రిస్టులు ఉన్న‌ట్లు ప‌క్కా సమాచారం అంద‌గా… భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్ర‌మంలో భార‌త‌ సైనికుల‌పై ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ‌టంతోనే ఎన్​కౌంటర్​ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. చనిపోయిన వారు ఏ సంస్థకు చెందినవారనేది తెలియాల్సి ఉంది.

జమ్మూ కాశ్మీర్​​లో ఎన్​కౌంటర్..ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం
Follow us

|

Updated on: Apr 17, 2020 | 1:35 PM

జమ్మూ కాశ్మీర్​​ షోపియన్​ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత సైన్యం​. షాపియన్​లోని డైరూ ప్రాంతంలో టెర్ర‌రిస్టులు ఉన్న‌ట్లు ప‌క్కా సమాచారం అంద‌గా… భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్ర‌మంలో భార‌త‌ సైనికుల‌పై ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ‌టంతోనే ఎన్​కౌంటర్​ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. చనిపోయిన వారు ఏ సంస్థకు చెందినవారనేది తెలియాల్సి ఉంది.