చిన్నాన్న ఆస్తి కోసం దారుణం, ఇద్దరు తమ్ముళ్లని రాళ్లతో కొట్టి !
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిన్నాన్న ఆస్తి కోసం ఓ యువకుడు ఇద్దరు సోదరులను దారుణంగా హతమార్చాడు.
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిన్నాన్న ఆస్తి కోసం ఓ యువకుడు ఇద్దరు సోదరులను దారుణంగా హతమార్చేందుకు ప్రయత్నించాడు. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన రాము చిన్నపిల్లలైన తన చిన్నాన్న ఇద్దరు కొడుకుల్ని పిలిచాడు. చాక్లెట్లు కొనిస్తానని నమ్మబలికి బయటకు తీసుకెళ్లాడు. పిల్లలు ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అనుమానంతో రాముని ప్రశ్నించగా.. ఇద్దరు చిన్నారులను రాళ్లతో కొట్టి కాలువలో తోసేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కూడేరు సమీపంలో శశిధర్ ప్రాణాపాయస్థితిలో కన్పించాడు. మరో చిన్నారి మోక్షజ్ఞ కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ( మెహబూబ్ ఘాటు వ్యాఖ్యలు, ఇచ్చి పడేసిన అఖిల్ )
ఆస్తి కోసం ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు రాము పోలీసులకు చెప్పిన్నట్లు సమాచారం. ఇద్దరు పిల్లలు చనిపోతే చిన్నాన్న వాటా కింద ఉన్న 10 ఎకరాల పొలం తనకే వస్తుందన్న ఆశతో ఈ ఘాతుకానికి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో చిన్నారి కోసం కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలియడంతో తల్లిదండ్రులు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. ( Bigg Boss Telugu 4: టాస్క్ గెలవడానికి అభి ట్రిక్, హర్టయిన హారిక )