నేను అన్నది కరెక్టే.. కానీ.. రవిశంకర్ ప్రసాద్
మూడు బాలీవుడ్ చిత్రాలు ఒకే రోజు రూ. 120 కోట్ల బాక్సాఫీసు వసూళ్లు సాధించాయని, దీన్ని బట్టి చూస్తే దేశ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని అర్థమవుతోందని తాను చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉపసంహరించుకున్నారు. తన కామెంట్ ని .. మీడియా సందర్భోచితం కాని రీతిలో వాడుకుందని ఆయన ఆదివారం పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.ఈ నెల 2 న విడుదలైన 3 బాలీవుడ్ సినిమాలు ఒకేరోజు రూ. […]
మూడు బాలీవుడ్ చిత్రాలు ఒకే రోజు రూ. 120 కోట్ల బాక్సాఫీసు వసూళ్లు సాధించాయని, దీన్ని బట్టి చూస్తే దేశ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని అర్థమవుతోందని తాను చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉపసంహరించుకున్నారు. తన కామెంట్ ని .. మీడియా సందర్భోచితం కాని రీతిలో వాడుకుందని ఆయన ఆదివారం పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.ఈ నెల 2 న విడుదలైన 3 బాలీవుడ్ సినిమాలు ఒకేరోజు రూ. 120 కోట్లు సాధించాయని అన్నారు. వాస్తవానికి అది సరైన స్టేట్ మెంటే అని, భారత చలన చిత్ర రాజధాని అయిన ముంబైలో ఉన్నాను గనుక అలా అన్నానని రవిశంకర్ ప్రసాద్ అంగీకరించారు. నా ట్విట్టర్లో నేను మీడియాతో ఇంటరాక్ట్ అయిన మొత్తం వ్యవహారం ఎవరికైనా అందుబాటులో ఉంది.. కానీ నేను చేసిన వ్యాఖ్యల్లో ఓ భాగాన్ని పూర్తిగా ట్విస్ట్ చేశారు అని ఆయన ఒకవిధంగా మీడియామీద ‘ నెపం ‘ నెట్టారు. ఏదిఏమైనా.. తనది సున్నిత (సెన్సిటివ్) హృదయం గనుక ఆ కామెంట్స్ ని ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చిత్ర పరిశ్రమ మనకు ఉండడం ఎంతో గర్వకారణమని, పన్నుల చెల్లింపుల ద్వారా ఈ పరిశ్రమ దేశానికి చాలా సేవ చేస్తోందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. అటు-ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను కోమల్ నహతా అనే వ్యక్తి రిలీజ్ చేశారు. ‘ అక్టోబర్ 2 జాతీయ సెలవు దినమని, ఆ రోజున విడుదలైన ‘ జోకర్ ‘, ‘ వార్ ‘, ‘ సైరా ‘ చిత్రాలు రూ. 120 కోట్ల వసూళ్లు సాధించాయని ఇందుకు కారణం దేశ ఆర్ధిక పరిస్థితి బాగా ఉండడమేనని ‘ ఆయన వ్యాఖ్యానించినట్టు ఇందులో స్పష్టంగా ఉంది. అయితే రవిశంకర్ ప్రసాద్ మాటలపై అప్పుడే విమర్శల జోరు పెరిగింది. చైనాకు సంబంధించి ఆ దేశ ఆర్ధిక పరిస్థితిని గమనించండి అని కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేష్ అన్నారు. ‘ ఆ దేశ ప్రధాని లీ కిజియాంగ్.. ‘ ఇండికేటర్లతో ‘ ఏకంగా తమ దేశ ఎకానమీని అంచనా వేసేందుకు తన పేరిట ఓ ఇండెక్స్ నే ఇన్స్ పైర్ చేయగలిగారు.. రైలు రవాణా, విద్యుత్ వినియోగం, బ్యాంక్ క్రెడిట్ వంటివాటిని ‘ ఉత్తేజపూరితం చేసారాయన అని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆ వ్యవస్థతో పోలిస్తే.. మన ఐటీ మంత్రిగారి డైలీ ఫిల్మ్ ట్రేడ్ చాలా బెటర్..నిజానికి ఇది ప్ర-సాద్ ఇండెక్స్ ‘ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దేశ ఆర్ధిక వృద్ది రేటు అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని, ఈ ఏడాది ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా, బ్రెజిల్ దేశాల్లో ఎకానమీ స్థితి దారుణంగా ఉందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జివా ఇటీవలే ప్రకటించిన విషయం గమనార్హం.
My comments made yesterday in Mumbai about 3 films making ₹120 Cr in a single day- the highest ever, was a factually correct statement. I had stated this as I was in Mumbai- the film capital of India. …(1/4) pic.twitter.com/RL62YhjpZt
— Ravi Shankar Prasad (@rsprasad) October 13, 2019