రెండు చోట్ల భారీ పేలుళ్లు.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం మేడపాడు గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే కాకినాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రగాయాలపాలైన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు తమిళనాడులో కూడా క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించాయి. విల్లుపురం జిల్లాలో భారీ పేలుడు ధాటికి […]

రెండు చోట్ల భారీ పేలుళ్లు.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2019 | 11:51 AM

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం మేడపాడు గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే కాకినాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రగాయాలపాలైన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

మరోవైపు తమిళనాడులో కూడా క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించాయి. విల్లుపురం జిల్లాలో భారీ పేలుడు ధాటికి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్ధాలు రావడంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు.