కేంద్రంతో ఢీ.. పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు రెడీ

సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై అయా పార్టీలు పదునుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టింది. టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని […]

కేంద్రంతో ఢీ.. పార్లమెంట్ సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు రెడీ
Follow us

| Edited By:

Updated on: Nov 17, 2019 | 4:41 AM

సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై అయా పార్టీలు పదునుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టింది. టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన వినతులపై ఈ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎంపీలకు సూచించారు.

హామీలపై నిలదీయండి..

విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, పెండింగ్ అంశాలను సభలో లేవనెత్తాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి నేటివరకు అనేకమార్లు ప్రధానమంత్రి సహా అనేకమంది కేంద్రమంత్రులు, అధికారులకు పలు అంశాలపై వినతిపత్రాలు ఇచ్చామని, అవి ఇంకా కార్యరూపం దాల్చడంలేదన్నారు. ఈ అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని.. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏర్పాటు చేయాల్సిన.. బయ్యారం ఉక్కు కర్మాగారం, మిషన్ భగీరథకు కేంద్ర నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా, ఐఐఎం లాంటి విద్యాసంస్థల ఏర్పాటు తదితర విజ్ఞప్తులను ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రుల ద్వారా, పార్లమెంట్‌లో ఫాలోఅప్ చేయాలని ఎంపీలకు కేటీఆర్ సూచించారు. ఇక హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రక్షణ భూముల బదలాయింపు వంటి తక్షణ అవసరమైన అంశాలపై ఎంపీలు పనిచేయాలని కోరారు.

ఆర్టీసీ సమ్మెపై బీజేపీ ప్రస్తావిస్తే..

అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన పలు విజ్ఞప్తులకు.. కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ అంశాలన్నీ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని.. వాటన్నింటిని ఎంపీలు ఫాలోఅప్ చేయాలన్నారు. పార్లమెంట్‌లో అంశాలవారీగా టీఆర్‌ఎస్ వైఖరి ఉంటుందని, అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు కేటీఆర్. ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె అంశంపై పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు ప్రస్తావిస్తే.. సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎంపీలకు కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల విషయంలో బీజేపీ వైఖరి, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టీసీల పరిస్థితిపై ప్రస్తావించాలన్నారు. ఇక ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన మోటర్ వెహికిల్ చట్టం గురించి కూడా మాట్లాడాలన్నారు.

Latest Articles