గుర్రపు స్వారీ చేస్తూ ‘పది’ పరీక్షలు రాసిన అమ్మాయి.. వైరల్ అవుతున్న వీడియో
కేరళ: గుర్రంపై స్వారీ చెయ్యాలని అందరికి ఆసక్తి ఉంటుంది. కానీ అది అనుకున్నంత సులువు కాదు. దానికి చాలా నైపుణ్యం కావాలి. సినిమాల్లో హీరో, హీరోయిన్లుకు కూడా గుర్రపు స్వారీ చేసే సన్నివేశం ఉంటే.. బాగా ట్రైనింగ్ తీసుకుని మరీ నటిస్తారు. లేకపోతే అభాసుపాలయ్యే పరిస్థితులు ఉంటాయి. మొన్నీమధ్య ‘మణికర్ణిక’ షూటింగ్ లో కంగనా రనౌత్ ఆర్టిఫిషియల్ గుర్రపు స్వారీ చేసి అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ […]
కేరళ: గుర్రంపై స్వారీ చెయ్యాలని అందరికి ఆసక్తి ఉంటుంది. కానీ అది అనుకున్నంత సులువు కాదు. దానికి చాలా నైపుణ్యం కావాలి. సినిమాల్లో హీరో, హీరోయిన్లుకు కూడా గుర్రపు స్వారీ చేసే సన్నివేశం ఉంటే.. బాగా ట్రైనింగ్ తీసుకుని మరీ నటిస్తారు. లేకపోతే అభాసుపాలయ్యే పరిస్థితులు ఉంటాయి. మొన్నీమధ్య ‘మణికర్ణిక’ షూటింగ్ లో కంగనా రనౌత్ ఆర్టిఫిషియల్ గుర్రపు స్వారీ చేసి అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే ఇలా గుర్రపు స్వారీ చేసి ఒక అమ్మాయి పదవ తరగతి పరీక్షలు రాసింది. ఆ వీడియో ఒకటి ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది.
అసలు వివరాల్లోకి వెళ్తే పదో తరగతి చదువుతున్న ఓ బాలిక గుర్రంపై దర్జాగా వెళ్తున్న ఓ వీడియోను మనోజ్ కుమార్ అనే నెటిజన్ పోస్టు చేశారు. పైగా ఆ బాలిక వార్షిక పరీక్షలు రాయడానికి పరీక్షా కేంద్రానికి గుర్రంపై వెళ్తోందట. ఆ బాలిక కేరళలోని త్రిసూర్కు చెందిన అమ్మాయిగా ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్ను హీరో సాయి ధరమ్ తేజ్ రీ-ట్వీట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. గుర్రపు స్వారీ అవలీలగా చేస్తున్న ఆ అమ్మాయికి హ్యాట్సాప్ చెబుతూ మనం కూడా ఒక్కసారి ఆ వీడియో చూసేద్దాం.
This video clip from my #whatsappwonderbox shows how a girl student is going to write her Class X final exam in Thrissur district, Kerala. This story made my Sunday morning brew of @arakucoffeein taste better! After all, ARAKU coffee is about #cupofchange #GirlPower @NanhiKali pic.twitter.com/45zOeFEnwV
— Manoj Kumar (@manoj_naandi) April 7, 2019