బ్రేకింగ్: మధ్య ప్రదేశ్లో కరోనాతో ముగ్గురు మృతి
మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో కరోనాతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఇండోర్లో కరోనా మరణాల సంఖ్య 68కి చేరాయి. కాగా మధ్యప్రదేశ్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,561 నమోదు కాగా..
మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో కరోనాతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఇండోర్లో కరోనా మరణాల సంఖ్య 68కి చేరాయి. కాగా మధ్యప్రదేశ్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,561 నమోదు కాగా.. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 129కి చేరింది. అలాగే 461 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం 1971 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎవరి నుంచి ఎవరికి వైరస్ ఎలా సోకుతుందో తెలియకపోవడంతో ప్రజల్లో కలవరపాటు మొదలైంది. అలాగే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేల మార్క్ని దాటేసింది. తాజా వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా.. 33050 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య ఏకంగా 1074కి చేరింది. ఇక 8325 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 23,651 యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read More:
వెహికల్ ట్యాక్స్పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం
మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి
జర్నలిస్ట్కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్కు నలుగురు మంత్రులు